నక్కపల్లి: ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న మంత్రి

65చూసినవారు
నక్కపల్లి: ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న మంత్రి
నక్కపల్లి మండలం పెదబోదుగల్లం గ్రామంలో శనివారం గ్యార్వి షరీఫ్ ఉరుసు ఉత్సవంలో రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్