డ్రైనేజీలు లేక ఇల్లలో చేరిన వరద నీరు

77చూసినవారు
చింతపల్లి మండలంలోని చిన్నగెడ్డ గ్రామంలో డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు శనివారం డిమాండ్ చేశారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు డ్రైనేజీలు లేక ఇల్లలో వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి చిన్నగెడ్డ గ్రామంలో డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని జనసేన మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి తదితరులు కోరారు.

సంబంధిత పోస్ట్