అరకులోయ మండల పరిసర ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ ఆకస్మిక వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్క పోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు సోమవారం సాయంత్రం సమయంలో కురిసిన ఆకసింక వర్షంతో ఉపశమనం లభించింది. అయితే కురుస్తున్న వర్షాలకు రాగి మొక్కజొన్న కూరగాయల విత్తనాలు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేసి ఉన్న ఆయా ప్రాంతాల గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.