పద్మనాభం మండలంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా

548చూసినవారు
పద్మనాభం మండలంలో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా
పద్మనాభ మండలం క్రిష్ణాపురం, బి. ఆర్. తాళ్లవలస సచివాలయాల్లో మొత్తం 40 మంది వాలంటీర్లు బుధవారం స్వచ్ఛందంగా రాజీనామ పత్రాలను ఎంపీడీఓ బి. శైలజ కు అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టిడిపి వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుండి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి ఇంటింటికి వెళ్లి వివరించి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్