కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

76చూసినవారు
కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని దేవరాపల్లి ఎస్సై సీహెచ్. మల్లేశ్వరరావు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 2 లక్షలు విలువ చేసే 64 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొర్ర రంజు(30), కొర్ర అర్జున్(28)తో పాటు కారు డ్రైవర్ కార్తీక్(40)ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్