విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు శనివారం నియోజకవర్గంలో జోరుగా ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుపై ఓటేయాలని కోరారు. అన్నీ చోట మహిళలు వెలగపూడికి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రామకృష్ణ బాబు నాలుగో సారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని అభిమానులు ఆకాంక్షించారు.