గంజాయి తరలిస్తున్న భార్య భర్త అరెస్ట్

558చూసినవారు
గంజాయి తరలిస్తున్న భార్య భర్త అరెస్ట్
గాజువాక పరిధిలోని అగనంపూడి టోల్‌గేటు వద్ద ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలను బుధవారం దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకుని 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో నివాసముంటున్న భార్యాభర్తలు నాగరాజు, భారతి దంపతులు కుక్కలను విక్రయిస్తూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారికి ఓమధ్యవర్తి ద్వారాబేరం కుదుర్చుకుని గంజాయి తరలిస్తు పట్టుబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్