సీఎం రమేశ్ నిర్వహించిన సమావేశంలో పోలీస్ అధికారుల తనిఖీలు...

580చూసినవారు
నర్సీపట్నంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆదివారం నిర్వహించిన కార్య కర్తల సమావేశంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సమావేశం నిర్వహించిన హోటల్లో చీరలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో స్క్వాడ్ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహిళా కార్యకర్తలు తాము తెచ్చుకున్న చీరలు కట్టుకుంటున్నామని అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో సీఎం రమేశ్, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్