వైసీపీకి పాడేరు ఎమ్మెల్యే గుడ్‌బై.. క్లారిటీ

3679చూసినవారు
వైసీపీకి పాడేరు ఎమ్మెల్యే గుడ్‌బై.. క్లారిటీ
తాను వైసీపీని వీడుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్పందించారు. "నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీని వీడే ప్రసక్తే లేదు. జగన్‌తోనే నా పయనం. వైసీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. 2029లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది." అని మత్స్యరాస ఆశాభావం వ్య‌క్తం చేశారు.

సంబంధిత పోస్ట్