గంజాయి నిర్మూలించేందుకే రాయితీ విత్తనాలు

77చూసినవారు
గంజాయి నిర్మూలించేందుకే రాయితీ విత్తనాలు
అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు నిర్మూలించేందుకే రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం రాయితీపై ఆదివాసి గిరి రైతాంగానికి రాజ్మా విత్తనాలు పంపిణీ చేస్తోందని ఎంపీపీ బడుగు రమేష్, ఏవో ఉమాదేవి పేర్కొన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలం చీడిపాలెం రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్మావిత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రైతులందరూ సబ్సిడీతో పంపిణీ చేసే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్