అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

76చూసినవారు
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
విశాఖ రైల్వే స్టేషన్ లోని ఎనిమిదవ నెంబర్ ఫ్లాట్ ఫారం దగ్గర్లో ఉన్న అవుట్ సైడ్ ట్రాక్ పక్కన అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని శనివారం స్థానికులు గమనించారు. వెంటనే కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ మృతదేహం కనిపించడంతో పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్