స్కూల్ బస్సుల ఫిట్నెస్పై దృష్టి పెడుతున్నట్టు ఉపరవాణా కమిషనర్ రాజారత్నం మంగళవారం తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో స్కూల్ బస్సులను విస్తృతంగా తనిఖీలు చేయనున్నామన్నారు. 30వ తేదీ వరకు తనిఖీలు చేస్తామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులను పూర్తి స్థాయి ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలని సూచించారు.