విశాఖ: ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం

70చూసినవారు
విశాఖ: ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం
విశాఖలోని 32 వార్డు పరిధిలో అల్లిపురం,నేరెళ్ల కోనేరు,చలువతోట,తారకరామ కాలనీ తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు వార్డులో పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, కమిషనర్ స్పందిస్తూ వార్డులోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్