బస్సు ప్రమాద బాధితులకు సీపీ పరామర్శ

64చూసినవారు
బస్సు ప్రమాద బాధితులకు సీపీ పరామర్శ
విశాఖలోని కైలాసగిరిపై ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని కేజీహెచ్ వైద్యులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్