ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ - కటక్ - హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి బుధవారం తెలిపారు. హైదరాబాద్ - కటక్ ప్రత్యేక రైలు 3, 16, 23, 30 తేదిల్లో రాత్రి 8. 10 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మర్నాడు ఉదయం 9. 05 గంటలకు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 9. 07 గంటలకు బయలుదేరి వెళుతుందన్నారు.