ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యపడుతుందని ఎలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇన్ ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మునగపాక మండలం చెర్లోపాలెంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. కూటమి అధికారంలోకి వస్తే అన్నదాతలకు ప్రతీ ఏటా వ్యవసాయ పెట్టుబడికి రూ. 20వేలు అందించడం జరుగుతుందన్నారు.