ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

52చూసినవారు
యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. హాస్పిటల్లో మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల స్టోర్ రూమును పరిశీలించి. రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు బీ. శ్రీనివాసరావు, కే. రవికుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్