సామాన్యుల ఆస్తులను దోచుకునేందుకు వైసిపి కుట్ర: మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
రాష్ట్ర ప్రజల ఆస్తులను దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. మంగళవారం తణుకులో ఆయన మాట్లాడారు. ప్రజల భూములపై హక్కు లేకుండా చేసేందుకు వైసిపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే చట్టం రద్దు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆస్తులపై ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్