చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా ఒక బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా వివరాలను డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు.