వైసీపీ పాలన మెచ్చి ఎంతోమంది వైసీపీలో చేరుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఈ మేరకు బుధవారం ఏలూరులోని ప్రముఖ సివిల్ ఇంజనీర్ బొమ్మ శేషుబాబు ఆళ్ల నాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని శేషుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు.