ఏలూరు నగర శివారు కొత్తూరు జూట్ మిల్లును మూసివేసేందుకు దాని యాజమాన్యం చూస్తోందని స్థానిక నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ మిల్లు మూసేస్తే అందులో పని చేస్తున్న 2వేల మందికి పైగా కార్మికులు నష్టపోతారన్నారు. వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆళ్ల నాని మిల్లు యాజమాన్యంతో మాట్లాడి మూతపడకుండా చేయాలని డిమాండ్ చేశారు.