కొత్త రైల్వేలైన్ నిర్మాణంపై రైల్వేశాఖ చేపట్టిన సర్వే అనుకూలం

70చూసినవారు
నరసాపురం- మచిలీపట్నం మధ్య ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన కొత్త రైల్వేలైన్ నిర్మాణంపై రైల్వేశాఖ చేపట్టిన సర్వే అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు నరసాపురంలో మీడియాతో మాట్లాడుతూ మొగల్తూరు, బంటుమిల్లు మీదుగా మచిలీపట్నం వరకు చేపట్టే కొత్త రైల్వే లైన్‌కు అయ్యే ఖర్చు, భూసేకరణ, ప్రయాణికుల రద్దీ, ఇతరరూట్లలో అనుసంధానం తదితర అంశాలపై రైల్వే ప్రాథమిక సర్వే చేసిందన్నారు

సంబంధిత పోస్ట్