పాలకొల్లులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి రామానాయుడు

63చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా రూ. 5 కే పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడన్నారు. దాతలు ముందుకు వచ్చి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మాదిరిగా జగన్ అడ్డుకున్నాడంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్