పోలవరం మండలం కొత్తపేటలో మంగళవారం బాబు ష్యూరిటి - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గోన్నారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు. అనంతరం బొరగం మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి రావణ కాష్టం చేశాడని ప్రజలకు మోయలేని పన్నుల భారం, పెరిగిన ధరలతో అసమర్థ పాలన చేస్తున్నాడని విమర్శించారు.