గోదావరిలో యువకుడు గల్లంతు

57చూసినవారు
గోదావరి నదిలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతైన ఘటన ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అహ్మద్ బాషా పోలవరంలో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. మిత్రులతో సరదాగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్