బుట్టాయగూడెం మండలం ఐటీడీఏ పరిధిలో ఉన్న గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 87.8% ఉత్తీర్ణత సాధించినట్లు ఐటీడీఏ పీవో సూర్య తేజ అన్నారు. ఈ సందర్భంగా శనివారం అత్యున్నత ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులను పీఓ అభినందించారు. ఆయన మాట్లాడుతూ. ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూచించారు. విద్యార్థులు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరారు.