రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటో తెలియడం లేదని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కాపు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. కాపులను కొత్తగా పడేయడానికి చంద్రబాబు వద్ద పవన్కు జనరల్ మేనేజర్ పోస్ట్తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కేటాయించారన్నారు.