మే నెల 1వ తేదీన ప్రతి ఇంటికి పెన్షన్లు పంపించాలని టిడిపి- జనసేన- బిజెపి ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మూడో వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి నేతలు చేస్తున్న అరాచక పాలనను వివరించారు. టిడిపి కూటమికి మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.