సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. బుధవారం గణపవరంలో స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్ జరిపిన తనిఖీల్లో రూ. 2 లక్షల 81 వేలు నగదు సీజ్ చేసినట్లు అధికారి ఆర్డీవో తెలిపారు.