గణపవరం మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల విభాగం వారిచే, విఖ్యాత భారతీయ ఆంగ్ల రచయితలపై విద్యార్థి సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. నిర్మల కుమారి అధ్యక్షత వహించారు. విద్యార్థులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆంగ్ల రచయితల జీవిత, రచనా విశేషాలను చర్చించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.