తాళ్లపూడి మండలంలో 41, 873 ఓటర్లు
ఓటరు సమాచార స్లిప్పులు బూత్ లెవెల్ అధికారుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తాళ్లపూడి డిప్యూటీ తహసిల్దార్ భారతి, ఏయస్ఓ జోడాల వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడారు. మొత్తం మండలంలో 41, 873 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 20, 514, మహిళలు 21, 358, ఇతరులు ఒక్కరు ఉన్నారని అన్నారు.