వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయితే వాలంటీర్లు
వైసీపీ కార్యకర్తలని, వారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్న క్రమంలో ఆ పార్టీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ
టీడీపీ,
జనసేన, ఇతర ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ఈసీ వాలంటీర్లను ఎన్నికల విధులు, పింఛను పంపిణీ నుంచి తప్పించింది. సచివాల ఉద్యోగుల ద్వారా పింఛను పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చింది.