చంద్రబాబు సమక్షంలో TDPలో చేరతా: వసంత

315690చూసినవారు
చంద్రబాబు సమక్షంలో TDPలో చేరతా: వసంత
రెండ్రోజుల్లో తాను టీడీపీలో చేర‌తానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. "చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేర‌తా. దేవినేని ఉమతో నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. చంద్రబాబు, లోకేశ్‌ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్‌ చెప్పారు. మైలవరం టికెట్‌ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. ఆ పార్టీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నా. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారు." అని వసంత పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్