ఐదేళ్ల వ్యవధిలో సంస్థ పేరిట రూ.1,250 కోట్ల అప్పులను గత ప్రభుత్వం తీసుకుంది. ఆ మొత్తాన్ని సంస్థ అభివృద్ధి కోసం కాకుండా. పర్సంటేజీలు తీసుకుని కాంట్రాక్టరులకు బిల్లులు చెల్లించడానికి వాడేసింది. ఈ తరహాలో జగన్ జమానాలో ఫైబర్నెట్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.