కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు

70చూసినవారు
కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు
దేశ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త నేర, న్యాయ చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం సెక్షన్‌ 281 బీఎన్‌ఎస్‌, ఎంవీ యాక్ట్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ను డిజిటల్‌గా నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్