ఏపీ ఫైబర్నెట్ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు, ఎంపీ అవినాష్రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఆ లేఖ తీసుకు రావడమే ఆలస్యమన్నట్లు. సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్రెడ్డి వారికి పోస్టింగులు ఇచ్చారు. ఫైబర్నెట్ను సొంత జేబు సంస్థలా వైసీపీ మార్చుకుందనడానికి ఇదే నిదర్శనం. అవసరంగా సిబ్బందిని నియమించడం వల్ల ఆర్థికంగా భారం పెరిగి నష్టాల్లో కూరుకుపోయింది.