జో బిడెన్‌తో మోదీ చర్చలకు అవకాశం

58చూసినవారు
జో బిడెన్‌తో మోదీ చర్చలకు అవకాశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీకి పయనమయ్యారు. ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రారంభమైన జీ7 దేశాల వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా జీ7 నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు జరపాలని ప్రధాని మోధీ భావిస్తున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ మాట్లాడుతూ.. మోదీ పర్యటన ఖరారైతే బిడెన్ సమావేశంలో మోదీని కలవాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్