ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్ షాక్

66చూసినవారు
ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్ షాక్
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతున్న వేళ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి షాకిచ్చింది. నీటి వ్యవహారంపై భారత అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ సందర్భంగా గురువారం తన మునుపటి ప్రకటనను ఉపసంహరించుకుంది. ఢిల్లీకి నీటిని విడుదల చేస్తామని చెప్పిన ఆ రాష్ట్రం, తాజాగా తమవద్ద మిగులు జలాలు లేవని కోర్టుకు తెలియజేసింది. కాగా, గత కొద్దికాలంగా ఢిల్లీ ప్రజలు హీట్‌వేవ్, నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్