కేకేఆర్‌ ముందు భారీ టార్గెట్‌..విజయం సాధించేనా

9514చూసినవారు
కేకేఆర్‌ ముందు భారీ టార్గెట్‌..విజయం సాధించేనా
ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్‌కే ఓపెనర్‌ డుప్లెసిస్‌ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్‌ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్‌ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 2, శివమ్‌ మావి 1 వికెట్‌ తీశాడు.