యాత్రికుల బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు మృతి

55చూసినవారు
యాత్రికుల బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు మృతి
పంజాబ్‌లోని లూథియానా సమీపంలోని సమ్రాలా వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న కేదార్‌నాథ్‌కు వెళ్తున్న యాత్రికుల బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్