హైదరాబాద్ జూలో 'అభిమన్యు' మృతి

85చూసినవారు
హైదరాబాద్ జూలో 'అభిమన్యు' మృతి
హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి 'అభిమన్యు' అనారోగ్యంతో మృతి చెందింది. ఇది అరుదైన తెలుపు బెంగాల్ టైగర్ కావడం గమనార్హం. బద్రి, సురేఖ అనే పులులకు 2015, జనవరి 2న ఇదే జూలో ఈ పులి జన్మించింది. నెఫ్రిటిస్ సమస్యతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇబ్బంది పడుతోందని జూ అధికారులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా ఆహారం తినలేదని, మంగళవారం మధ్యాహ్నం చనిపోయినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్