బేల మండలంలోని ఖార గ్రామంలో యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రూపేష్ రెడ్డి శనివారం పర్యటించారు. గ్రామంలోని ఆదివాసి ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యాయన్నారు. గ్రామంలోని రోడ్లు, మంచినీరు తదితర అంశాలను జిల్లా, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.