స్వచ్ఛదనం- పచ్చదనంలో భాగంగా మొక్కలు పంపిణీ

73చూసినవారు
స్వచ్ఛదనం- పచ్చదనంలో భాగంగా మొక్కలు పంపిణీ
స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సదా సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సంగి సంతోష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో, పరిసరాల్లో మొక్కలు నాటి పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్