రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

78చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మందమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి రాజేష్ (20) మృతి చెందాడు. తన స్నేహితుడు నాగరాజుతో కలిసి బుధవారం తాండూరు మండలం నుంచి భీమారంకు బైక్ పై వెళ్తుండగా మందమర్రి వద్ద వెనుక నుంచి ఆటో డీకొట్టడంతో రాజేష్ కు గాయాలయ్యాయి. అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్