గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

55చూసినవారు
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్
సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని గురువారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై సుగుణాకర్ ఆధ్వర్యంలో తీగల్ పహాడ్ శివారులోని క్రషర్ మిల్ చెట్ల పొదల్లో గంజాయి కలిగి ఉన్న గోదారి రాజు, జాడి వంశీ, సాయి కుమార్ లను పట్టుకోగా మరో నలుగురు నిందితులు పరారయ్యారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్