విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన వైద్యులు శశికాంత్

64చూసినవారు
విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసిన వైద్యులు శశికాంత్
సమాజంలో ప్రతి ఒక్కరికి కనీస మానవతా దృక్పథం ఉండాలని, సమాజ సేవ కోసం ఎంతో కొంత చేయాలని ప్రముఖ వైద్యుడు నాలం శశికాంత్ అన్నారు. మంగళవారం నాదాన్ ఫరిందే(మ్యాన్ కైండ్ ఫార్మా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ మండలం కొండాపూర్ శాంతినికేతన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులను, ఇతర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సమాజ సేవకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్