మణిపూర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితి, ఈ పరిస్థితిని ఇంకా మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.