TG: జగిత్యాల జిల్లా ప్రధానాసుపత్రిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి చేరుకున్న పేషేంట్ అరగంటకు పైగా అంబులెన్స్లోనే ఉండాల్సి వచ్చింది. కాలు విరగటంతో అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చిన పేషేంట్, స్ట్రెచర్ లేక అంబులెన్స్లోనే అరగంటకు పైగా ఉండాల్సి వచ్చిందని, పేషేంట్ తరఫు బంధువులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.