ఏపీ రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో అమరావతిని పూర్తిచేస్తామని తెలిపారు. రాజధానికి ప్రజల డబ్బు ఖర్చు చేయమని, వివిధ రుణాల ద్వారా నిధులు సేకరిస్తామని అన్నారు. రాజధాని భూమి విలువలతో రుణం తీర్చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని ప్రాంతంలో మొలచిన పిచ్చి మొక్కలను తొలగించారు. కాగా, ఏపీకి కేంద్రం కూడా సహాయం అందిస్తుండడం విశేషం.