ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ 11 పరుగులకే ఔట్ అయ్యారు. 26వ ఓవర్లో టీమిండియా బౌలర్ జడేజా వేసిన ఆఖరి బంతికి కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్కు క్యాచ్ ఇచ్చి జోష్ ఇంగ్లిస్ పెవిలియన్ చేరారు. దీంతో జడేజాకు రెండో వికెట్ లభించింది. కాగా, 29 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 152/4 గా ఉంది.